28-06-2025 12:04:08 AM
వనపర్తి టౌన్, జూన్ 27 : వనపర్తి జిల్లాలోని క్షయ, మధుమేహం వ్యాధిగ్రస్తుల వైద్యం, ఆ రోగ్య వివరాలను ఆన్లైన్ లో నిక్షిప్తం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
మధుమేహం, క్షయ తదితర వ్యాధిగ్రస్తులు ఎలాంటి వైద్యం పొందుతున్నారు, వారికి ఇస్తున్న మందులు ఏంటి అనే పూర్తి వివరాలు ఒక పోర్టల్ లో నిక్షిప్తం ఉండటం వల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చిన రికార్డు చూసి మెరుగైన వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక యాప్ ను తయారు చేయించారు.
వనపర్తి మెడికల్ హెల్త్ రికార్డు అనే యాప్ లో వివరాలు ఏ విధంగా నమోదు చేయాలి, దీనిని ఏ విధంగా నియంత్రించాలి అనే విషయాల పై శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వీడియో కా న్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు. జిల్లా వైద్య అధికారి డాక్టర్ శ్రీనివాస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సాయినాథ్ రెడ్డి డాక్టర్ పరిమళ, ఈ డి.యం విజయ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.