28-06-2025 12:05:03 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులకు చదువే లక్ష్యం కావాలని, చదువుతో ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని మహబూబాబాద్ రూరల్ సిఐ వి.దీపిక అన్నారు. మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ గూడెం ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం విద్యార్థినిలకు మహిళల భద్రత, సైబర్ క్రైమ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న నేరాల నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జాకీర్, హెడ్ కానిస్టేబుల్ రాజగోపాల్, కానిస్టేబుల్ ఈర్య, అశోక్, సోమ మల్లు, పాఠశాల హెడ్మాస్టర్, హాస్టల్ వార్డెన్, విద్యార్థినిలు పాల్గొన్నారు.