calender_icon.png 27 October, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు

27-10-2025 06:20:19 PM

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని, వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత డిఎస్పీ/ఎఎస్పీ, సర్కిల్ ఇన్స్పెక్టర్ లతో  ఫోన్ లో ద్వారా మాట్లాడి సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలన్నారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని పేర్కొన్నారు.