12-06-2025 12:01:03 AM
- అంధకారంలో కార్మిక వాడలు
- రోడ్డుపై పడిన వృక్షాలు
బెల్లంపల్లి అర్బన్, జూన్ 11 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గాలివాన బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి కురిసిన అకాల భారీవర్షo, బీభత్సo అతలాకుతులం చేసింది. గాలి వానకు బెల్లంపల్లిలో ప్రాంతా ల్లో విద్యుత్ స్తంభాలు పడిపోయి, చెట్లు విరిగి తీగలపై పడడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
పట్టణాన్ని అంధకారం ఆవరించింది. సివిల్ కోర్టు పక్కన దారిలో, పోలీస్ హెడ్ క్వార్టర్ ముందు రహదారిలో భారీ వృక్షాలు నేలకూలాయి. బెల్లంపల్లి బస్తిలోని ప్రభుత్వ కళాశాల బోర్డు, గాంధీ నగర్ లో 6 కరెంట్ స్తంబాలు విరిగి పడిపోయా యి. ఇంకా పలుచోట్లా చెట్లు విరిగి పడటం తో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
చెట్లు విరిగి కొన్నిచోట్ల రోడ్లకు అడ్డంగా పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాత్రి నుండి కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై పడిపోయిన వృక్షాలను మున్సిపల్ సిబ్బంది తొల గిస్తున్నారు. ఇదే క్రమంలో విద్యుత్ పునరుద్ధరణ పనులు కూడా వేగంగా చేపట్టారు. దశల వారీగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిసున్నారు. విద్యుత్ అంతరాయాలు, అడ్డం కుల్ని తొలగిస్తూ కాలనీలకు విద్యుత్ ను సరఫరా చేస్తున్నారు. గాలివాన బీభత్సంతో పట్ట ణం ఒక్కసారిగా ఉలిక్కి పాటుకి గురైందంటే అతిశయోక్తి కాదు.