calender_icon.png 19 June, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం

19-06-2025 12:21:04 AM

కరీంనగర్ క్రైం, జూన్18(విజయక్రాంతి): నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం హెచ్చ రించారు. కమిషనరేట్ పరిధిలో నార్కోటిక్ సెల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని, ఈ సందర్భంగా బుధవారం ఆయన వెల్లడించారు. నార్కోటిక్ జాగిలం ’లియో’తో జిల్లా కేంద్రంలో తనిఖీలను ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు.

కమిషనరేట్ పరిధిలో నిషేధిత గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడానికి కరీంనగర్ ఒకటవ ఠాణా పోలీసులు బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్, పార్సిల్ కార్యాలయాలు, కిరాణా షాపులు, పాన్ షాపులు, హాస్టళ్లు, అనుమానిత ఇళ్లలో ఎస్త్స్ర రాజన్న ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ జాగిలం, డాగ్ హ్యాండ్లర్ కానిస్టేబుల్ ఎ. శంకర్ కూడా ఈ తనిఖీల్లో పాలుపంచుకున్నారు.

ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఎవరైనా వ్యక్తుల వద్ద ప్రభుత్వం నిషేధించిన గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు ఉన్నా, వాటిని విక్రయిస్తున్నట్లు సమాచారం ఉన్నా వెంటనే డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు తెలియజేయాలని కమిషనర్ గౌస్ ఆలం విజ్ఞప్తి చేశారు. కమిషనరేట్ వ్యాప్తంగా ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయనస్పష్టంచేశారు.