10 March, 2026 | 5:45 PM

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్ ప్రావీణ్య

19-06-2025 12:21 AM

సంగారెడ్డి, జూన్ 18(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలో ఇటీవల బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య  బుధవారం  జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.భవాని చంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. సంగారెడ్డి న్యాయస్థాన సముదాయ భవనంలోని జిల్లా జడ్జి ఛాంబర్లో  ప్రధాన న్యాయమూర్తికి పూల మొక్కను అందించారు. ఈ సందర్భంగా  న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో అమలు చేసే న్యాయ సహాయ కార్యక్రమాలపై కొద్దిసేపుచర్చించారు.