28-05-2025 12:00:00 AM
ఇంద్రవెల్లి, మే 27 (విజయక్రాంతి): రైతు లు తమ పంట పొలాలలో పండించే పంటలను శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటి స్తే మేలు చేకూరుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామంలోని రైతు వేదిక భవనం లో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు‘ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతు లు రసాయనాల వాడకాన్ని తగ్గించి, సేం ద్రియ వ్యవసాయ సాగుపై దృష్టి సారించాలని అన్నారు. రసాయనాల వాడకం వల్ల భూ కాలుష్యం పెరిగి, మానవ మనుగడకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. పురాతన కాలంలో పండించిన పంటలను మళ్ళీ సాగు చేయాలని సూచించారు.
నకిలీ విత్తనా లు, ఎరువులు సరఫరా కాకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.