03-06-2025 10:20:55 PM
దేవస్థానం ఈవోని కోరిన బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి..
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం దేవాలయంలో భక్తులు మనోభావాలు దెబ్బతినేలా కవర్ల ద్వారా అన్య మత ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి(Bharatiya Janata Party President Byreddy Prabhakar Reddy) కోరారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి రామాలయంను సందర్శించి మొన్న ఆదివారం జరిగిన సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... స్వామి వారి శేష వస్త్రాలు అమ్మే కౌంటర్ లో అన్యమత ప్రచారం సంబందించిన ప్రచార కవర్ లో పెట్టి శేష వస్త్రాలు అమ్మిన సంఘటనలో దేవాలయం ఈవో రమాదేవిని వివరణ అడిగారు. దీనికి బాద్యులు ఆయన వారి మీద చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కుంజాధర్మ, జిల్లా ఉపాధ్యక్షులు పసుమర్తి సతీష్, జిల్లా కౌన్సిల్ నెంబర్ నిడదవోలు నాగబాబు. సీనియర్ నాయకులు ఆవుల సుబ్బారావు, ములిశెట్టి రామ్మోహన్రావు బోడ సత్యనారాయణ, ముక్కెర కోటేశ్వరి, మండల ప్రధాన కార్యదర్శులు చెలుబోయిన వెంకన్న, పేరం ఉపేందర్, యువమోర్చా నాయకులు ములిశెట్టి నిఖిల్, అల్లాడి వెంకటసుబ్బయ్య, గార్లపాటి శీను, డి ఎస్ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.