03-06-2025 10:14:16 PM
పెన్ పహాడ్: క్షయ వ్యాధి బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. వ్యాధి కట్టడి మన చేతిలోనే ఉందని యంపిహెచ్ఈఓ భూతారాజు శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా(Suryapet District) పెన్ పహాడ్ మండలం చెట్ల ముకుందాపురం గ్రామంలో మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో నిక్షయ శివిర్-2 క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో 40 మంది నుండి తేమడ(కళ్లె) నమూనాలను సేకరించి సిబినాట్ ల్యాబ్ కు పంపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యల్ టి లింగాల రాజు, మధు, ఇందిరా, సునీత, నాగలక్ష్మి, బి.రాధ, తదితరులు పాల్గొన్నారు.