24-06-2025 12:00:00 AM
కన్నాయిగూడెం,జూన్23(విజయక్రాంతి)ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలోని సోమవారం ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ అదేశాల మేరకు స్థానిక ఎస్త్స్ర ఇనిగాల వెంకటేష్ ఆద్వర్యంలో అభయమిత్ర కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్త్స్ర వెంకటేష్ మాట్లాడుతూ అభయమిత్ర పోలిస్ అంటే ప్రజలకు,సహాయం చేయడానికి వారిలో,భద్రత భావాన్ని పెంపొందించడానికి పోలిసులు రూపొందించిన ఒక కార్యక్రమమని మత్తుపదార్థాల నిర్మూలన వారోత్సవాలలో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం, పోలిసులు కృత నిశ్చయంతో పనిచేస్తున్నారనిన్నారు.
అనంతరం అభయమిత్ర కార్యక్రమంలో భాగంగా కన్నాయి గూడెం మండలంలోని యువతకు వాలీబాల్ కిట్లు అందజేశారు అనంతరం వాహ నాల తనిఖీలు చేపట్టి వాహనాధారులకు పలు సూచనలు చేశారు వాహనాలు నడుపుతూ హెల్మెట్ ధరించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెల్మెట్ ధరించని నాలు గు ద్విచక్ర వాహనాలకు 24వందల రూ. జరిమానా విధించడం జరుగిందని తెలిపారు.