17 April, 2026 | 10:33 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

‘శాతవాహనలో ఒప్పంద సహాయ ఆచార్యుల సమ్మె సైరన్‘

23-04-2025 12:55 AM

కరీంనగర్, ఏప్రిల్22(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్, పార్ట్ టైం సహాయ ఆచార్యుల నిరవధిక సమ్మె ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ సెటిల్మెంట్ గా కాంట్రాక్ట్, పార్ట్ టైం సహాయ ఆచార్యులని రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్ తో, 12 విశ్వవిద్యాలయాలలో సుమారు 1200 మంది కాంట్రాక్ట్, పార్ట్ టైం గా పనిచేస్తున్నారని, రెండు దశబ్దాల కాలంగా విశ్వవిద్యాలయలలో తమ శ్రమతో,

చాలీచాలని జీతాలతో పనిచేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తూ విశ్వవిద్యాలయాలను కాపాడుకుంటూ వచ్చామని ఇన్ని సంవత్సరాల తమ కృషిని, కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ నిరవధిక సమ్మెలో గోదావరిఖని పీజీ కళాశాల, విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాల,

విశ్వవిద్యాలయ ఆరట్స్ సోషల్ సైన్సెస్, విశ్వవిద్యాలయం కామర్స్- బిజినెస్ మేనేజ్మెంట్,  విశ్వవిద్యాలయ సైన్స్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్ టైం సహాయ ఆచార్యులు సుమారు 39 మంది విశ్వవిద్యాలయ ఆవరణలో టెంటు వేసి ప్రారంభించారు. వివిధ విశ్వవిద్యాలయాలతో పాటు ఈ నిరవధిక సమ్మెకు శాతవా హన విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులూ తమ సంఘీభావం వ్యక్తం చేశారు. శాతవాహన విశ్వ విద్యాలయంలో పనిచేస్తున్న రెగ్యులర్ అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బందీ తమ మద్దతును తెలిపారు.