23-04-2025 12:55:10 AM
కరీంనగర్, ఏప్రిల్22(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్, పార్ట్ టైం సహాయ ఆచార్యుల నిరవధిక సమ్మె ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ సెటిల్మెంట్ గా కాంట్రాక్ట్, పార్ట్ టైం సహాయ ఆచార్యులని రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్ తో, 12 విశ్వవిద్యాలయాలలో సుమారు 1200 మంది కాంట్రాక్ట్, పార్ట్ టైం గా పనిచేస్తున్నారని, రెండు దశబ్దాల కాలంగా విశ్వవిద్యాలయలలో తమ శ్రమతో,
చాలీచాలని జీతాలతో పనిచేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తూ విశ్వవిద్యాలయాలను కాపాడుకుంటూ వచ్చామని ఇన్ని సంవత్సరాల తమ కృషిని, కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ నిరవధిక సమ్మెలో గోదావరిఖని పీజీ కళాశాల, విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాల,
విశ్వవిద్యాలయ ఆరట్స్ సోషల్ సైన్సెస్, విశ్వవిద్యాలయం కామర్స్- బిజినెస్ మేనేజ్మెంట్, విశ్వవిద్యాలయ సైన్స్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్ టైం సహాయ ఆచార్యులు సుమారు 39 మంది విశ్వవిద్యాలయ ఆవరణలో టెంటు వేసి ప్రారంభించారు. వివిధ విశ్వవిద్యాలయాలతో పాటు ఈ నిరవధిక సమ్మెకు శాతవా హన విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులూ తమ సంఘీభావం వ్యక్తం చేశారు. శాతవాహన విశ్వ విద్యాలయంలో పనిచేస్తున్న రెగ్యులర్ అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బందీ తమ మద్దతును తెలిపారు.