calender_icon.png 22 June, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం

23-04-2025 12:53:37 AM

  1. అన్ని రంగాలకు సముచిత స్థానం 
  2. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

మహబూబ్ నగర్ ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : అభివృద్ధిని పరుగులు పెట్టించే బా ధ్యత ప్రజాపాలన తీసుకుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక శాఖ, సాం స్కృతిక శాఖ మంత్రి త్రాగు నీటి సరఫరా, ధాన్యం కొనుగోలు, పర్యాటక అభివృద్ధి పనులు,గ్యాస్ సబ్సిడీ తదితర అంశాలు సమీక్షించారు.

అభివృద్ది కార్యక్రమాలు అ మలులో నిర్లక్ష్యం కు తావు లేద ని, వేసవిలో త్రాగు నీటి సమస్య రాకుడా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లో రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యంకు రశీదు ఇవ్వాల న్నారు. పెండింగ్ పర్యాటక అభివృద్ది పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. సి.ఎం.అర్ బకాయిలు మిల్లర్ల నుండీ రికవరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

అంతకుముందు ధరణి ద్వారా పరిష్కారం కాని భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి అర్. ఓ .అర్ చట్టం 2025 ఏప్రిల్ 14 న అం బేద్కర్ జయంతి రోజున అమలు లోకి తీసు కు వచ్చినట్లు రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక,సాం స్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. .మంగళవారం భూత్ఫూర్ మండ లం కె.వి ఎన్ పంక్షన్ హాల్ లో నిర్వహించిన భూ భారతి సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సదస్సులో మంత్రి మాట్లాడుతూభూభారతి చట్టం అమలు లోకి రాకముందు ఎన్నో రకాల భూ సమస్యలతో రైతులు,సామాన్య ప్రజలు ఇబ్బంది ఎదురుకొన్నారని తెలిపారు.భూమి హక్కు గౌరవం, అత్మ విశ్వాసం, ధైర్యం అని అన్నారు.గత 50,60 సంవత్సరాల క్రితం తెల్ల కాగితాలపై కొనుగోలు చేసిన సాదా బైనామా రెవిన్యూ రికార్డుల్లో నమోదు చేయలేధని తెలిపారు.

భూమి కొనుగోలు చేసిన పట్టాదారు రికార్డు లో నమోదు కాక పోవడం కారణంగా రైతుకు బంధు,రైతు భరోసా రాలేదని తెలిపారు. సాగు చేసుకునే రైతు పేరు కాకుండా ధరణిలో ఉన్న వారే యజమానులుగా వ్యవహరిస్తున్నారు.దాన్ని ఆసరా చేసుకుని తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలంటే మళ్ళీ డబ్బులు డి మాండ్ చేస్తున్నారని తెలిపారు.భూ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాక ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.

భూ రికార్డులను సవరణ చేసేందుకు అధికారులకు అధికారం లేదని అన్నారు. రకరకాల భూ సమస్యలతో రైతులు మ నోవేదనకు గురయ్యారని, చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ధరణి ద్వారా నష్టపోయిన రైతులకు న్యా యం చేసేందుకు భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు.పాస్ పుస్తకాల్లో సవరణలు నిర్దేశిత సమయంలోగా పరిష్కరించడం జరుగుతుందని అ న్నారు.

గతం లో ఇచ్చిన దరఖాస్తులను, సాధా బైనామా దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరి సంతోషం కో సం ప్రభుత్వం ప్రతిక్షణం శ్రమిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  మహబూబ్ నగర్ శాసన సభ్యులు యెన్నం శ్రీనివాసరె డ్డి, దేవరకద్ర శాసన సభ్యులు జి.మధు సూ ధన్ రెడ్డి,జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,రెవెన్యూ అదనపు కలెక్టర్‌మోహన్ రావు,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత తదితరులు ఉన్నారు.