calender_icon.png 20 June, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి కృషి

07-06-2025 12:00:00 AM

-ఎమ్మెల్యే పాయల్ శంకర్

అదిలాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి తన వంతుగా కృషిచేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామంలో 50 లక్షల నిధుల వ్యయంతో నిర్మించే శ్రీరామ కళ్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

అనంతరం మకోడ, ఆకుర్ల గ్రామాలలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలకు ఇడ్లు అందే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా మొదటి విడతగా గ్రామంలో 30 ఇళ్లను మంజూరు చేసుకోవడం జరిగిందన్నారు.

ఒక మంచి ఆలోచనతో, నిజాయితి తో, విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ముందుకు వెళుతున్నానని అన్నారు. నియోజకవర్గ ప్రజలు తనకు ఇచ్చిన అవకాశం వల్లనే అసెంబ్లీలో రైతుల సమస్యలపై మాట్లాడటం జరిగిందన్నారు. అధికారమనేది సొంతం కాదని.. ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కరుణాకర్‌రెడ్డి, రాకేష్ రెడ్డి, అశోక్‌రెడ్డి, విశాల్, విజయ్, గంగాధర్, భూమన్న, వేద వ్యాస్,  సింగడి రమేష్ రెడ్డి, ఆశ రెడ్డి, వెంకట్ రెడ్డి, దత్త, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.