09-08-2024 12:05:00 AM
ఎల్బీనగర్, ఆగస్టు 8: మహిళల రక్షణే షీ టీమ్ లక్ష్యమని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు అన్నారు. వేధింపులు, ఇతర అవమానాలు ఎదురైనప్పుడు భయపడకుం డా.. ధైర్యంగా బాధితులు షీ టీమ్ లేదా స్థాని క పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూ చించారు. ఎల్బీనగర్లోని ఉమన్ సెఫ్టీ వింగ్, షీ టీమ్ క్యాప్ కార్యాలయంలో గురువారం ఈవ్టీజర్లకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. కేసు తీవ్రతను అనుసరించి కొందరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా మరికొందరిని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్లో స్పెషల్ డ్రౌవ్ నిర్వహించి 15 రోజుల వ్యవధిలో(జూలై 16 నుంచి 31వ తేదీ) మహిళలు, విద్యార్థినులు, యువతుల ను వేధిస్తున్న సుమారు 138 మందిని అరె స్టు చేశారు. వారిలో 68 మంది మేజర్లు, 70 మైనర్లు ఉన్నారు. వారందరికీ కుటుంబ స భ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ ఉమన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషావిశ్వనాథ్, షీటీం పోలీసులు పాల్గొన్నారు.