calender_icon.png 28 May, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో పీజీ కళాశాల, శ్రీపాద మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయండి

27-05-2025 12:52:38 PM

మంథని,(విజయక్రాంతి): మంథనిలో పీజీ కళాశాల, శ్రీపాద మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కృషి చేయాలని మంథని విద్యార్థి సంఘం నాయకుడు బెజ్జంకి డిగంబర్ మంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. ఈ సందర్భంగా డిగంబర్ మాట్లాడుతూ... మంథని పట్టణంలోని విద్యార్థిని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈ ప్రాంతంలో పీజీ కళాశాల లేకపోవడం బాధాకరమన్నారు. పేదలకు వైద్యం అందుబాటులో ఉండేలా శ్రీపాద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్(Sripada Institute of Medical College) ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో అందజేశారు. మంథని ప్రాంతం విద్యావంతులకు వేదికైన ప్రాంతం అన్నారు. మంత్రి  స్పందిస్తూ పీజీ కళాశాల కోసం కృషి చేస్తానని, మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తానని డిగంబర్ కు హామీ ఇచ్చారు. మంత్రికి డిగంబర్ కృతజ్ఞతలు తెలిపారు.