7 April, 2026 | 2:42 AM

‘మన అగ్రిటెక్’లో విద్యార్థులు

02-12-2024 12:14 AM

వరంగల్(జనగామ), డిసెంబర్ 1 (విజయక్రాంతి): వరంగల్ ఎనుమాముల వ్యవ సాయ మార్కెట్‌ను ఆదివారం కరీంనగర్‌కు చెందిన మహాత్మా జ్యోతిరావు ఫూలే వ్యవసాయ కళాశాల విద్యార్థులు సందర్శించారు. మా ర్కెట్‌లోని ‘మన అగ్రిటెక్’ను సందర్శిం చి కీలక విషయాలు తెలుసుకున్నారు.

మన అగ్రిటెక్ ప్రదర్శనలో స్టాళ్లను సీఈవో రమేశ్ విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభించేలా చైతన్యం తీసుకురావాలన్నారు. వ్యవసాయ పరికరాల ప్రదర్శనపై అధ్యాపక బృందం, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.