7 May, 2026 | 5:54 PM

Breaking News

మురుగు నీటిని నిల్వ ఉంచకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి   •   వరదల నివారణ చర్యలపై ప్రణాళికతో ముందుకు వెళ్లాలి   •   సబ్ ట్రెజరీ కార్యాలయం తరలించవద్దు   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన సర్పంచ్   •   వైన్ షాప్ ల వద్ద ట్రాఫిక్ కష్టాలు.. చర్యలు తీసుకోండి   •   రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు   •   మంద రాజయ్య కు ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు   •   ఇంటర్ బోర్డు విలీనంపై ప్రభుత్వం పునరాలోచించాలి   •   మాల్తుమ్మెద పిఏసిఎస్ చైర్మన్ దుందిగల్ నర్సింలుకు ఘన సన్మానం   •   సౌర విద్యుత్తును వినియోగించి పంటలను సాగు చేసుకోండి   •  

విద్యార్థులు సమాజంపై సమగ్ర అవగాహన

03-03-2026 07:10 PM

హనుమకొండ,(విజయక్రాంతి): సుబేదారి ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండ సమ్మయ్యనగర్ ప్రాంతంలో విస్తృత సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ప్రజలతో అనుసంధానం పెంపొందించడం, విద్యార్థుల్లో సామాజిక బాధ్యతా భావం బలపరచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ అంజన్ రావు మాట్లాడుతూ... విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సమాజంలోని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. యువత సమాజ సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు విద్యార్థుల్లో సేవాభావం, నాయకత్వ లక్షణాలు, సామాజిక స్పృహను పెంపొందిస్తాయని తెలిపారు. ఎన్ఎస్ఎస్ విభాగం అధికారిని డాక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ, స్థానిక ప్రజలతో చర్చలు నిర్వహించారు.