21-06-2025 12:10:58 AM
గద్వాల, జూన్ 20 ( విజయక్రాంతి ) : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నది అగ్రహారం సమీపంలో ఉన్న పాలమూరు పీజీ కేంద్రంలో కొద్దిరోజులుగా వంటమాస్టర్ లేక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. వంటమాస్టర్ లేకపోవడంతో నిత్యం విద్యార్థులే మూడు పూటలా వంటలు వండుకుని తిని కళాశాలకు వస్తున్నామని దీంతో ఇబ్బందిగా మారిందని విద్యార్థులు వాపోయారు.
పీజీ కేంద్రంలో వంటమాస్టర్ ను ఏర్పాటు చేయాలని నిరసిస్తూ శుక్రవారం కళాశాల గేట్ కు తాళం వేసి నిరసన చేపట్టారు. గతంలో విద్యార్థులు లేరనే ఉద్దేశ్యంతో వంట మాస్టర్ ను ఏర్పాటు చేయలేదని ఉన్నతాధికారులు చెప్పారని ఇప్పుడు విద్యార్థులు వున్నా వంట మాస్టర్ ను ఏర్పాటు చేయలేకపోతున్నారని విద్యార్థులు ఆరోపించారు.