21-06-2025 12:08:48 AM
ఆలయ ఛైర్మన్, అర్చకుల దిష్టిబొమ్మ దగ్దం
- ఆలయ భూమిలో తమ ఇండ్లను కూల్చడంతో బాధితుల నిరసన
చారకొండ, జూన్ 20: మండలంలోని శిరుసనగండ్ల గ్రామం అయోధ్య నగర్ లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఎంతోకాలంగా ఆలయ భూముల్లోనే తలదాచుకుంటూ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారిని కక్షపూరితంగా ఆలయ అధికారులు ఆలయ పూజారులు తమ ఇళ్ళను కూల్చాలంటూ కోర్టు మెట్లు ఎక్కారని ఫలితంగా గురువారం అధికారులు తమ ఇళ్లను నేల కొల్చారని బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు.
శుక్రవారం ఆలయ చైర్మన్ రామ శర్మ, అర్చకులు మురళీ శర్మ, లక్ష్మణశర్మ, మేనేజర్ నిరంజన్ చిత్రపటాలతో కూడిన దిష్టిబొమ్మలకు చెప్పుల దండను మెడలో వేసి దగ్ధం చేశారు. తమ ఇండ్లను కక్షపూరితంగా ఆలయ చైర్మన్, అర్చకులు కూల్చివేశారని శాపనార్థాలు పెట్టారు. ఆలయ భూముల్లో తమ ఇండ్లు కూల్చినప్పుడు అర్చకుల ఇండ్లను కూడా కూల్చివేయాలని డిమాండ్ చేశారు. మాకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరికి దేవుడే శిక్ష వేస్తాడని అన్నారు. కార్యక్రమంలో నిర్వాసితులుపాల్గొన్నారు.