calender_icon.png 27 October, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు విద్యతో పాటు నేరాలపై అవగాహన ఉండాలి: ఇన్స్పెక్టర్ భాస్కర్

27-10-2025 08:28:28 PM

ఉప్పల్ (విజయక్రాంతి): విద్యార్థులకు విద్యతో పాటు నేరాలపై అవగాహన ఎంతో ముఖ్యమని ఉప్పల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో భాగంగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో మారకద్రవ్యాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో శాంతిభద్రతల సమాజ రక్షణ కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసు అమరవీరుల పౌర సమాజం నివాళులర్పిస్తుందన్నారు. విద్యార్థులుకు  మార్కద్రవ్యాల దూరంగా ఉండి బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని ఆయన విద్యార్థులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ సబ్ ఇన్స్పెక్టర్ చిరంజీవి ఉప్పల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.