26-06-2025 12:09:30 AM
గద్వాల టౌన్ జూన్ 25 : మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని డి.ఎస్పీ మొగిలయ్య అన్నారు. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు ఆదేశాల మేరకు బుధవారం డి.ఎస్పీ వై మొగిలయ్య గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డి.ఎస్పీ మాట్లాడుతూ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని మత్తుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని యువత మానసిక స్థితిని కోల్పోయి నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో షిటీం ఎస్త్స్ర స్వాతి,షిటీం సిబ్బంది, ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.