26-06-2025 12:11:03 AM
భారీ మొత్తంలో బెల్లం పాకం ధ్వంసం
కల్వకుర్తి, జూన్ 25: వంగూరు మండల పరిధిలోని తిరుమలగిరి, తిప్పారెడ్డిపల్లి, జాజాల, రంగాపూర్ తండాల్లో అక్రమ నాటు సారా కాస్తున్నట్లు తెలుసుకుని మ హబూబ్నగర్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, కల్వకుర్తి ఎక్సైజ్ అధికా రులు సంయుక్తంగా బుధవారం ప్రత్యేక దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో సుమారు 800 లీట ర్ల బెల్లం పాకం, 20 లీటర్ల నాటు సారాను అధికారులు ధ్వంసం చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో సీఐలు జె .వెంకట్ రెడ్డి , వి. వెంకటేశ్వర రెడ్డి తో పాటు సిబ్బందిపాల్గొన్నారు.