12-06-2025 12:20:39 AM
ఎంఈవో పావని
చిగురుమామిడి, జూన్ 11(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సమ తుల్యమైన ఆహారాన్ని అందించాలని మండల విద్యాధికారి పావని గారు సూచించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్న భోజన కార్మికులు, కస్తూరిభా గాంధీ పాఠశాలలో శానిటేషన్ వర్కర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఎంఈవో ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధానోపా ధ్యాయులు పర్యవేక్షణ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులకు తగు సూచనలు ఇవ్వాలన్నారు. విద్యార్థులలో శారీరక, మానసిక వికాసానికి సమతుల ఆహారం అత్యవసరమని, దీంతోపాటు విద్యార్థులలో ఏకాగ్రత పెంపొందించడానికి పరిశుభ్రమైన పోషకాహారం తోడ్పడుతుందని పేర్కొన్నారు.
అలాగే పాఠశాల పరిశుభ్రతలో శానిటేషన్ వర్కర్లు చేయాల్సిన పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధా నోపాధ్యాయులు రబియా బస్రి, జిల్లా రిసోర్స్ పర్సన్ లక్ష్మణ్ రావు, మండల రిసోర్స్ పర్సన్ చంద్రశేఖర్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.