calender_icon.png 15 June, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిశు మందిరాలు సంస్కృతికి నిలయాలు

12-06-2025 12:19:00 AM

విద్యాభారతీ సంఘటనా కార్యదర్శి సుధాకర్ రెడ్డి 

జగిత్యాల, జూన్ 11 (విజయక్రాంతి): మన సనాతన భారత సంస్కృతి, సంప్రదాయాలకు శ్రీసరస్వతీ శిశు మంది రాలు నిలయాలని విద్యాభారతీ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని శ్రీసరస్వతీ శిశు మందిరంలో నూతనంగా నిర్మించిన భవనం, తరగతి గదులను బుధవా రం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

ముందుగా పాఠశాలలో గాయత్రి యజ్ఞం, సరస్వతి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ప్రముఖ వైద్యులు డాక్టర్ వేముల ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన వక్తగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు దేశభక్తి మిళితం చేసి శిశు మందిరాల్లో విద్యాబోధన జరుగుతుందన్నారు. ఇలాంటి పాఠశాలలను సమాజంలో అందరూ ఆదరించాలని, వాటి అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు.

శ్రీసరస్వతి విద్యాపీఠం ప్రాంత సంఘటనా కార్యదర్శి పతాకమూరి శ్రీనివాస్ రావ్ మాట్లాడుతూ శిశు మందిరాలు అభివృద్ధి చెంది, పూర్వ వైభవం సం తరించుకోవడంలో పూర్వ విద్యార్థుల కృషి ఉందన్నారు. వీటిని మరింతగా అభివృద్ధి చేసి, విద్యార్థులకు మంచి విద్యా బుద్ధులు నేర్పించాలన్నారు. ఈ పాఠశాల పూర్వ విద్యార్థి, ఆదర్శ ఆటో మోటివ్స్ మేనేజింగ్ డైరెక్టర్ బూర్గు సత్యనారాయణ గౌడ్ పాఠశాల అభివృద్ధికి రూ. 10 లక్షల విరాళం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది బొడ్ల శ్రీనివాస్, పూర్వ ప్రధానాచార్యులు బండారి కమలాకర్, పాఠశాల ప్రబంధ కారిణి సభ్యులు డాక్టర్ వేముల రవికిరణ్, వడ్లకొండ రాజగంగాధర్, వనపర్తి చంద్ర మోహన్, అందె శివప్రసాద్, నీలి శ్రీనివాస్,  ప్రధానాచార్యులు గోపు వెంకటేష్, ఆచార్య బృందం, స్థానిక ప్రముఖులు తదితరులుపాల్గొన్నారు.