06-06-2025 06:34:15 PM
నిర్మల్,(విజయక్రాంతి): కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. శుక్రవారం సోని కేజీబీవీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కార్మికులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు రుచికరమైన, పౌష్టిక ఆహారాన్ని అందించాలని, వారి విద్యా ప్రగతికి తోడ్పాడాలని సూచించారు. అందుకు వంట సిబ్బంది సరైన జాగ్రత్తలు పాటిస్తూ, నాణ్యమైన సరుకులతో రుచికరంగా వండి, వడ్డించాలని తెలియజేశారు.
ఇందుకోసం హైదరాబాదులో ఒకరోజు శిక్షణ తీసుకొని వచ్చిన డీఆర్పీలు చెప్పే అంశాలను జాగ్రత్తగా విని సరైన ప్రమాణాలను పాటిస్తూ ఎస్ఓపి ప్రకారం, నూతన మెనూ ప్రకారం వంటలు వండి విద్యార్థులకు అందించాలని తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, విద్యార్థులకు అన్ని పోషకాలకుతో కూడిన నాణ్యమైన తాజా కూరగాయలు, సరుకులతో రుచికరంగా వండి విద్యార్థులకు అందించాలని, వారి ఆరోగ్యాన్ని కాపాడుతూ, వారు చదువులో ముందుండేలా దోహదపడాలని సూచించారు.