23 June, 2026 | 10:22 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలి

17-04-2025 12:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

హాజీపూర్ (మంచిర్యాల), ఏప్రిల్ 16 (విజయక్రాంతి) : కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో గల కేంద్రీయ విద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి విద్యాలయం పరిసరాలు, గదులను పరిశీలించారు. ఈ సం దర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన గుణాత్మక విద్యను అందించాలని తెలిపారు. కేంద్రీయ విద్యాలయం ద్వారా జాతీయ స్థాయి క్రీడా పోటీలకు విద్యార్థులు ఎంపికయ్యారని, వారి స్ఫూర్తిగా విద్యార్థులు విద్యతో పాటు క్రీడా రంగంలో రాణించాలని తెలిపారు. విద్యార్థులు విద్యలో రాణించే విధంగా ఉపాధ్యా యులు కార్యచరణ ప్రకారంగా అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.