17 March, 2026 | 12:52 PM

Breaking News

బడ్జెట్ అంచనాలు బోల్తా కొట్టాయి.. రివైజ్డ్ అంచనాలు రీచ్ కావట్లేదు   •   ఈ నెల 22 నుంచి రైతు భరోసా పంపిణీ.. అసెంబ్లీ సాక్షిగా ఆది శ్రీనివాస్ ప్రకటన   •   మియాపూర్‌లో రోడ్డుకు అడ్డంగా పడిన బస్సు.. 10 మందికి గాయాలు   •   8 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. 4 నెలల గర్భిణి భార్యను చంపిన భర్త   •   కేసీఆర్ సంచలన నిర్ణయం.. పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!   •   కూకట్‌పల్లిలో భారీ దారి దోపిడీ.. కళ్లలో కారం కొట్టి..   •   పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి   •   గవర్నర్ ప్రసంగం డొల్ల   •   ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి   •   రాష్ట్ర అభివృద్ధిలో.. ప్రతి పౌరుడు భాగస్వామి   •  

విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలి

17-04-2025 12:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

హాజీపూర్ (మంచిర్యాల), ఏప్రిల్ 16 (విజయక్రాంతి) : కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో గల కేంద్రీయ విద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి విద్యాలయం పరిసరాలు, గదులను పరిశీలించారు. ఈ సం దర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన గుణాత్మక విద్యను అందించాలని తెలిపారు. కేంద్రీయ విద్యాలయం ద్వారా జాతీయ స్థాయి క్రీడా పోటీలకు విద్యార్థులు ఎంపికయ్యారని, వారి స్ఫూర్తిగా విద్యార్థులు విద్యతో పాటు క్రీడా రంగంలో రాణించాలని తెలిపారు. విద్యార్థులు విద్యలో రాణించే విధంగా ఉపాధ్యా యులు కార్యచరణ ప్రకారంగా అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.