23 June, 2026 | 11:43 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

పిల్లాడికి కాల్చి వాత పెట్టిన అంగన్వాడీ ఆయా..?

17-04-2025 12:00 AM

విచారణ చేపట్టిన సీడీపీఓ 

మహబూబాబాద్, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో మణిదీప్ అనే చిన్నారికి అంగన్వాడీ ఆయా కత్తి వేడి చేసి వాత పెట్టినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సిడిపిఓ శిరీష విచారణ నిర్వహిస్తున్నారు. గత గురువారం తమ పిల్లాడిని అంగన్వాడీ ఆయా కాల్చి వాత పెట్టిందని,

ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు శనివారం అధికారు లకు ఫిర్యాదు చేయగా స్థానికంగా ఆయా పనితీరుపై సిడిపిఓ విచారణ నిర్వహించారు. ఆయా పనితీరు సరిగా లేదని, పలువురు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని, ఈ విషయంపై నివేదిక జిల్లా కలెక్టర్, ఉన్నతాధి కారులకు అందజేసి తదుపరి చర్యలు తీసుకుంటామని సిడిపిఓ తెలిపారు.