విద్యార్థులు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి
కోదాడ (మునగాల)డిసెంబర్ 29: విద్యార్థులు కుటుంబ శ్రేయస్సుకే పరిమితం కాకుండా సమాజం పట్ల కూడా బాధ్యత కలిగి ఉండాలని డీఎస్పీ ఆర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. మునగాల మండలంలోని నర్సింహాపురం గ్రామంలో కెఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ విద్యార్థుల శీతాకాల శిబిరం ముగింపు సందర్భంగా సోమవారం నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ పాల్గొని మాట్లాడారు.
ఎన్.ఎస్.ఎస్. యూనిట్ ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ వేమూరి సత్యనారాయణ, దేవాలయ కమిటీ చైర్మన్ గుండు మధుసూదన్ ,రణబోతు పిచ్చిరెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ రెడ్డెబోయిన ప్రశాంత్, కిడ్స్ విద్యాసంస్థ చైర్మన్ నీలా సత్యనారాయణ. పంచాయతీ కార్యదర్శ వెంకటేశ్వర్లు .ఎన్.ఎస్.ఎస్. సేవకులు, గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులు. గ్రామ పెద్దలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.






