16-10-2025 01:26:45 AM
ఎమ్మెల్యే పాయల శంకర్
ఆదిలాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాం తి): మారుతున్న కాలంతో పాటు పెరుగుతు న్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముం దుకు సాగాలని ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. జైనథ్ మండలంలోని అడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆశా ఫర్ ఎడ్యుకే షన్ సహకారంతో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.1,80,000 విలువ గల స్మార్ట్ కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఈ స్మార్ట్ ల్యాబ్ను ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ... ప్రస్తుతం స్మార్ట్ యుగం కొనసాగుతుందని దానికి అనుగుణంగా విద్యార్థులు కం ప్యూటర్ శిక్షణలు తీసుకోవాలన్నారు. వారికి ఉపయోగపడేలా ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్మార్ట్ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పుస్త కాలంలో ప్రతి పోటీ పరీక్ష ఆన్లైన్లోనే కొనసాగుతుందన్నారు.
అదే దిశగ విద్యార్థులు ఇప్ప టినుంచే ఎదగాలన్నారు. పాఠశాలలో ఏర్పా టు చేసిన స్మార్ట్ ల్యాబ్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా పాఠశాలలో మౌలిక వసతులు కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం.ఈ.ఓ శ్రీనివాస్, పాఠశాల హెచ్.ఎం గుణవంత్, ఏకలవ్య ఫౌండేషన్ కోశాధికారి సతీష్ దేశ్పాండే, ప్రోగ్రాం మేనేజర్ ప్రశాంత్, ట్రస్టీలు దిగంబర్, రామ్రెడ్డి పాల్గొన్నారు.