విద్యార్థులు మాస్టర్ మైండ్స్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్ ,జూన్ 2(విజ య క్రాంతి): జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యం లో గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మాస్టర్ మైండ్స్ గూగుల్ మీట్ ఆన్లైన్ తరగతులను 10వ తరగతి చదువుతున్న విద్యా ర్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. మంగళవారం స మీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో మాస్టర్ మైండ్స్ ఆన్లైన్ తరగతుల సమన్వయకర్తలు, జిల్లా సై న్స్ అధికారి కటకం మధుకర్, ధర్మపురి వెం కటేశ్వర్లు లతో కలిసి మాస్టర్ మైండ్స్ ప్రచార ప్రతులను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం 4.45 గంటల నుండి నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగతులు అద్భుత ఫలితా లు సాధిస్తున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






