13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

సబ్ స్టేషన్ ఆపరేటర్ బైక్ దగ్ధం

14-01-2026 11:22 AM

కల్వకుర్తి: విధుల్లో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ ఆపరేటర్ బైకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో పూర్తిగా దగ్ధమైన సంఘటన మంగళవారం అర్ధరాత్రి ఉరుకొండ మండలం మాదారంలో  చోటు చేసుకుంది. చారగొండ మండలం తుర్కలపల్లికి చెందిన మహేష్ అనే ఆపరేటర్ రోజువారీ గా మంగళవారం విధులు నిర్వహిస్తున్నాడు. అర్ధరాత్రి 12 గంటలకు త్రీఫేస్ విద్యుత్తు సరఫరాను ప్రారంభించి నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారుజామున తన గది పక్కనే  ఉన్న  బైకు పూర్తిగా కాలిపోయి కనిపించింది. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతోనే బైకు దగ్ధమైనట్లు మహేష్ తెలిపారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.