19 May, 2026 | 11:43 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ బరిలో గాజుల రాజేశ్వర్?

14-01-2026 11:21 AM

గత 20 సంవత్సరాలుగా ప్రజాసేవ,సామాజిక సేవ కార్యక్రమాలు...

అందరివాడు లాగా ప్రజలతో మమేకం...

పార్టీ అవకాశం ఇస్తే మున్సిపల్ చైర్మన్ బరిలో నిలబడతా...

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ మున్సిపల్ చైర్మన్ బరిలో బాన్సువాడకు చెందిన గాజుల రాజేశ్వర్ ఉంటున్నట్లు  తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తూ అటు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ వ్యాపారం చేసుకుంటూ ప్రజల మన్నలను పొందిన వ్యక్తిగా రాజేశ్వర్ ఉన్నారు. అందరివాడు లాగా ప్రజలతో మమేకమై ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజాసేవకే తన జీవితం అంకితమని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున అవకాశం ఇస్తే తాను చైర్మన్ బరిలో నిలబడతానని అన్నారు. అదేవిధంగా ప్రజలకు సేవ చేసుకునే మరింత అవకాశం దొరుకుతుందని ఇలాంటి అవకాశం మళ్లీ రాదని పెద్దలు అవకాశం ఇవ్వాలని ప్రజల కోరిక మేరకు చైర్మన్ బరిలో ఉంటున్నానని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు పాల్గొనడం జరిగిందన్నారు. ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే ప్రజలకు సేవ చేస్తానని ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు.