calender_icon.png 19 June, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ రూరల్ మండలంలో బడిబాటలో విస్తృతంగా పాల్గొన్న సుడా చైర్మన్

18-06-2025 12:00:00 AM

కొత్తపల్లి, జూన్ 17:కరీంనగర్ రూరల్ మండలం చర్లభూత్కూర్,దుబ్బపల్లి,చామన్ పల్లి, నగునూర్ గ్రామాల బడిబాట కార్యక్రమాలలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన అన్ని పాఠశాలలోని కొత్తగా చేరిన విద్యార్థులు దాదాపు వంద మందికి స్వయంగా స్కూల్ బ్యాగులు అందజేశారు.

పాఠశాలల్లోని అందరు విద్యార్థులు దాదాపు అయి దు వందల మందికి నోట్ బుక్స్ అందజేశారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్ర భుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి వాతావరణం గాని భోదన గాని వేరే దగ్గర ఉండదని అన్నారు. చర్లభుత్కూర్, దుబ్బపల్లి,చామన్ పల్లి, నగునూర్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగానే ఉందని స్థానిక నాయకుల సహకారంతో పాటు ప్రధానోపాధ్యాయుల మరియు ఉపాధ్యాయుల సహకారం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు.

చర్లభూత్కూర్ పాఠశాలలో ఈజీయస్ నిధులతో నూత న ప్రహరీ గోడ మరియు గేటు నిర్మాణ పనులకు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశా రు.ఈ కార్యక్రమాలలో ఎంఈవో రవీందర్,ఎంపిడివో సంజీవ రావు,కంరెడ్డి రాంరెడ్డి, సాయిని తిరు పతి, పెంచలా లక్ష్మన్ రావు,నరేష్ రెడ్డి,నారాయణ గౌడ్, స్వామి గౌడ్, ప్రశాంత్ రెడ్డి, అల్వలా శ్రీకాంత్,అల్వలా ప్రశాంత్,జగ్గని కనకయ్య, బుర్ర గంగయ్య, దీకొండ గంగయ్య,రాజు, తాండ్ర లక్ష్మన్, శేఖర్,రాజేష్ కన్నా, అధ్యాపకులు బోధనా సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.