29-06-2025 01:53:13 AM
వజీరిస్థాన్, జూన్ 28: పాకిస్థాన్లో తాలిబన్లు మరోసారి రెచ్చిపో యారు. శనివారం ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్లో పేలుడు పదార్థాలు ఉన్న వాహనంతో సైనిక కాన్వాయ్పై ఓ ఉగ్రవాది దాడికి దిగి.. 16 మంది సైనికుల ప్రాణాలను బలితీసుకున్నాడు. ఈ ఘటనలో రెండు డజన్ల ప్రజలు గాయపడ్డారు. పేలుడు త ర్వాత అక్కడికక్కడే 13 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు సైనికులు మరణించినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు.
దీంతో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. భారీ పేలు డు సంభవించడంతో రెండు ఇళ్ల పైకప్పులు కూలిపోయాయి. దీంతో ఇండ్లలో ఉన్న ఆరుగురు పిల్లలు గాయపడ్డారు. అఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు 2021లో కాబూల్లో అఫ్ఘన్లు రెండో సారి అధికారం చేపట్టిన తర్వా త పాక్లో ఆత్మాహుతి దాడు లు పెరిగాయి.
తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ఈ పేలుడుకు బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. ఈ ఏడాది తొలి నుంచి బలోచిస్థాన్, ఖైబర్ పఖ్తుంక్వా ప్రాంతాల్లో తాలిబన్లు జరిపిన దాడుల్లో దాదాపు 290 మంది భద్రతా దళాల సభ్యు లు మరణించారు.