20-06-2025 08:27:30 PM
బోథ్ (విజయక్రాంతి): ఆరోగ్యం బాగాలేదని మానసికంగా కృంగిపోయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి. బోథ్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్(SI Praveen Kumar), మృతుడి మేనల్లుడు విజయరాజ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... లోక రాజేందర్ రెడ్డి(53) మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో నైట్ వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. గత కొన్ని రోజుల నుండి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల అనారోగ్యం ఎక్కువ కావడంతో, తీవ్ర మనోవేదనకు గురై, జీవితంపై విరక్తి చెంది శుక్రవారం పాఠశాల దగ్గరలోని చెట్టుకు కరెంటు తీగతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.