16-06-2025 12:00:00 AM
పిడుగుపాటు మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆదిలాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): గాదిగూడ మండలం పిప్పిరి గ్రామంలో ఇటీవలే పిడుగుపాటుకు గురై మరణించిన కుటుంబాలను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కొవ లక్ష్మి పరామర్శించారు. ఆదివారం మృతుల నివాసానికి వెళ్లి మరణించిన వారి చిత్ర పటాలకు నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
వారి దీన గాధను విన్న, చిన్న చిన్న పిల్లలను చూసి ఎమ్మెల్యే కంటతడి పెట్టుకున్నారు. అనంతరం ఎమ్మె ల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. పంటపొలాల్లో పత్తి విత్తనాలు నాటుతున్న సమయంలో పిడుగులు పడి రైతులు, రైతు కూలీలు నలుగురు మృతి చెందడం, కొందరు గాయపడ టం చాలా బాధాకరం అన్నారు. ఈ ఘటన జరగడంపై తీవ్ర మనస్థాపానికి గురయ్యయని తెలిపారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఎక్స్గ్రే షియా అందించాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన రైతు భీమా, రైతు భరోసా ఇచ్చి కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.