calender_icon.png 16 June, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రం శాంతి చర్చలు జరపాలి

16-06-2025 12:00:00 AM

సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి డిమాండ్

ఆదిలాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టు లను, అమాయక ఆదివాసీలను హతమారుస్తున్న కేంద్రప్రభుత్వం చేస్తున్న దామనకాండను నిలిపివేసి, శాంతి చర్చలు జరపాలని సీపీఐ పార్టీ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు.

స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని ఇందిరా పార్కు వద్ద ఈనెల 17 తేదీన చేపట్టే మహా ధర్నాను జయప్రదం చేయాలని పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ సం దర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరిట జనవరి 2024 నుండి మావోయిస్టులను అణచివేసే పేరిట ప్రారంభించిన యు ద్ధం ఆదివాసులతో పాటు మావోయిస్టు లపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం మారణకాండ పట్టిందన్నారు.

రాజ్యాంగంలో పేర్కొన్న ఆదివాసులు హక్కుల్ని అణిచివేయడం జరుగు తుందని, అక్కడి ప్రకృతి వనంలో ఖనిజ సంపద స్వదేశీ విదేశీ కార్పొరేట్‌లకు ధరదత్తం చేయడం కోసమే ఈ ఎన్‌కౌంటర్లను చేపడుతుందని ఆరోపించారు. అనేక మంది మావోయిస్టులను, జాతీయ కమిటీ సభ్యు డు నంబాల కేశవరావు, అలాగే మైలాపురం ఆడేల్లు అలియాస్ భాస్కర్ అనేక మందిని పొట్ట పెట్టుకుందన్నారు. ఇటీవల కర్రె గుట ల్లో వేలాది మంది సాయిధబలగాలని చుట్టుముట్టి యుద్ధ వాతావరణం తలపిస్తుంద న్నారు.

ఈ విధంగా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దమనకాండ కు వ్యతిరేకంగా ఆపరేషన్ కాగార్ ను ఆపాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు నళిని రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు గోవర్ధన్, పట్టణ కార్యదర్శి,అరుణ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటల రాములు తదితరులు పాల్గొన్నారు.