14 July, 2026 | 6:36 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

గ్రూప్ నియామకాల్లో జోక్యం చేసుకోబోం

03-04-2026 02:05 AM

హైకోర్టు తీర్పుపై స్పష్టం చేసిన సుప్రీం కోర్టు

వాదనలు విన్నాక పిటిషన్ డిస్మిస్

హైదరాబాద్, ఏప్రిల్ 2 : ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ఉద్యోగ నియామకాల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్ ను జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం డిస్మిస్ చేసింది. గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు ఇంతకుముందు హైకోర్టును ఆశ్రయించారు. మూల్యాంకనంలో తప్పులున్నాయని, నోటిఫికేషన్ రద్దు చేసి.. మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కోరారు.

విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్.. గ్రూప్-1 పరీక్షలో అక్రమాలు కనిపించలేదని తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదనలు పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పునిచ్చిందని కోర్టుకు వివరించారు. మూడుసార్లు మూల్యాంకనం జరిగిందని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అక్రమాలకు తావులేకుండా నియామక ప్రక్రియ చేపట్టినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.