calender_icon.png 7 June, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

07-06-2025 12:00:00 AM

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ అవినీతి ఆరోపణలు చేశారు. రూ.25వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ ఆయన ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ ఉట్నూరు పోలీస్‌స్టేషన్‌లో కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు.

తనపై నమోదైన ఈ కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు కేటీఆర్‌కు అనుకూలంగా ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుగుణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలంటూ కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.