06-06-2025 11:24:38 PM
శేరిలింగంపల్లి: మియాపూర్ పిఎస్ లిమిట్స్ లో శుక్రవారం భారీగా డిఫెన్స్ మద్యం పట్టుబడింది. అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన వ్యక్తిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు రిమాండుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ మాతృశ్రీ నగర్ లోని ఓ రేకుల షెడ్లో భారీగా డిఫెన్స్ మద్యం బాటిళ్ల అక్రమ నిల్వ ఉంచినట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రేకుల షెడ్ పై రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడి చేశారు. రూ.5 లక్షల విలువ చేసే వివిధ బ్రాండ్లకు సంబంధించిన 160 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. నిందితుడు మన్నవ గాంధీ(65)ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.