11-06-2025 12:31:08 AM
రైతు సదస్సులో గ్రామస్తుల వినతి
భద్రాద్రి కొత్తగూడెం జూన్ 10 (విజయక్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పరిధిలోని పాండురంగపురంలో సుమారు 800 ఎకరాల సీలింగ్ భూమి సీ మల బోడు ప్రాంతంలో ఉందని, దాన్ని స ర్వే చేయించి అర్హులైన రైతులకు పట్టాలి ఇ ప్పించాలని ఆ గ్రామ రైతులు తహసిల్దార్ కోరారు.
మంగళవారం పాండురంగపురం గ్రామంలో పాల్వంచ తాసిల్దార్ దారా ప్రసా ద్ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో 1986లో ప్రభుత్వం 70 మం ది గిరిజన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారని, భూమి మాత్రం రైతుల కు స్వాధీనం చేయలేదని వారు తెలిపారు. కొంతమంది రైతులకు తెలంగాణ పాస్ పుస్తకాలు ఇచ్చి, మరికొందరికి మొండి చేయి చూపారని వారు ఆరోపించారు. ప్రస్తుతం సీ మల బోడు ప్రాంతంలో 800 ఎకరాల సీలింగ్ భూమి, సర్వేనెంబర్ 126 లో 1826 ఎకరాలు ఎస్త్స్రన్మెంట్ భూమి ఉందన్నారు.
అట్టే భూమిపై సర్వే నిర్వహించి అర్హులైన గిరిజన రైతులకు అప్పగించాలని వారు కోరా రు. కార్యక్రమంలో సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గుగులోత్ బ ద్రునాయక్, యువసేన అధ్యక్షులు బానోత్ భరత్ నాయక్, పాండురంగపురం మాజీ స ర్పంచ్ బిచ్చు నాయక్, ఆంగోత్ రాములు, నాయక్ కిషన్, హేమ, చందర్ భూక్య తదితరులు పాల్గొన్నారు.