11-06-2025 12:31:41 AM
* కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు
చిగురుమామిడి జూన్ 10(విజయక్రాంతి): బిఆర్ఎస్ నాయకులు వాళ్ళ స్థాయి కి మించి విమర్శలు చేస్తే బాగుండదని కాం గ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు హెచ్చరించారు. చిగురుమామిడి మండల కేంద్రంలో ఏర్పా టు చేసిన విలేకరుల మావేశంలో వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులు చౌకబారు రాజకీయాలతో భ్రష్టు పట్టించుకుం టున్నారన్నారు.
పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం కోసం అహర్నిశలు కృషిచేసి మండలంలో ఒంటి చేతితో పార్టీకి పునాదులు వేసి, రెండుసార్లు సర్పంచ్ గా, జడ్పిటిసిగా సింగిల్ విండో డైరెక్టర్ గా ఓటమెరుగని బడుగు బలహీన వ ర్గాల నాయకుడు గీకురు రవీందర్ ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఆ పార్టీ నాయకులపై చౌకబారు విమర్శలు చేస్తే రాబోయే ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవ రన్నారు. ఈ పత్రిక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు బెజ్జంకి అంజయ్య, దొబ్బ ల బాబు, జిల్లల భగవాన్ ప్రసాద్, కవ్వంపల్లి సంజీవ్, జిల్లల రమేష్, పెసరి శ్రీనివాస, శిరవేణి సంపత్, చిట్టెల కృష్ణ మేకల పరశురాములు, బెజ్జంకి కుమార్ తదితరులు పాల్గొన్నారు.