15 July, 2026 | 5:21 PM

Breaking News

పెద్ద ఆత్మకూరు పల్లె దవాఖానను సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ   •   గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ లక్ష్యం   •   కంచర్లకు అదనపు ఆర్టీసీ బస్సు ట్రిప్పు మంజూరు   •   93,101,104 BLO బ్లాక్ లను సందర్శించిన మాజీ జెడ్పిటిసి   •   క్రమశిక్షణ ఐక్యతకు నీడలు ఉపకరిస్తాయి: సిఐ డి.గురుస్వామి   •   టీజీవీపీ భిక్కనూర్ మండల కళాశాల కమిటీల నియామకం   •   కంటైనర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు గాయాలు, ప్రయాణికులు క్షేమం   •   సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •   యోగాతో మానసిక ప్రశాంతత ఆరోగ్యం   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సురేందర్   •  

స్విగ్గీ ప్రీమియం లిస్టింగ్

14-11-2024 01:50 AM

న్యూఢిల్లీ, నవంబర్ 13: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ నిర్వహిస్తున్న స్విగ్గీ షేర్లు బుధవారం స్టాక్ ఎక్సేంజీల్లో ప్రీమియం ధరతో లిస్టయ్యాయి. ఆఫర్ ధర రూ.390తో పోలిస్తే  బీఎస్‌ఈలో 5.6 శాతం అధికంగా రూ. 412 వద్ద లిస్టయిన సిగ్గీ తదుపరి 10 శాతం వరకూ పెరిగి రూ.465 వద్ద నిలిచింది.ఈ ధర వద్ద కంపెనీ మార్కెట్ విలువ రూ. 92 వేల కోట్లుగా ఉన్నది.  రూ.11,327 కోట్ల సమీకరణకు గతవారం జారీఅయిన స్విగ్గీ ఐపీవో 3.6 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. 

500 మంది స్విగ్గీ ఉద్యోగులు కోటీశ్వరులు

స్విగ్గీ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లను పొందిన ప్రస్తుత, మాజీ ఉద్యోగుల్లో 500 మంది కంపెనీ లిస్టింగ్‌తో కోటీశ్వరులయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 5,000 మంది ఉద్యో గులు పొందిన స్టాక్ ఆప్షన్ల విలువ లిస్టింగ్‌నాటి షేరు ధర ప్రకారం రూ.9,000 కోట్లని ఆ వర్గాలు వివరించాయి.