02-06-2025 06:17:49 PM
సింగరేణి ఏరియా జిఎం దేవేందర్..
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సోలార్ టెక్నీషియన్ కోర్సును యువకులు, సింగరేణి కార్మికుల పిల్లలు సద్వి నియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్(Singareni Area General Manager G Devender) కోరారు. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ అండర్ ఎస్సిసిఎల్, సీఎస్ఆర్, రీజినల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ (ఆర్డిఎస్డిఈ), హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సోలార్ టెక్నీషియన్ కోర్సును సోమవారం పట్టణంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఆయన ప్రారంభించి మాట్లాడారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సింగరేణి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాంల సూచనల మేరకు స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి చేకూర్చే దిశగా సింగరేణి కాలరీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. నిరుద్యోగ యువత, సింగరేణి ప్రభావిత ప్రాంత పిల్లలు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శిక్షణ అనంతరం ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తూ తమ భవితకు బంగారు బాటలు వేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ, సలేంద్ర సత్యనారాయణ, సిఎంఓఏఐ అధ్యక్షులు రమేష్, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఎంవిటీసీ మేనేజర్ శంకర్, ఎంవిటిసి అసిస్టెంట్ ట్రైనింగ్ మేనేజర్ అశోక్, సోలార్ టెక్నీషియన్ ట్రైనర్ ప్రవీణ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.