calender_icon.png 4 June, 2025 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన విత్తనాలను నాటండి.. అధిక దిగుబడి పొందండి

02-06-2025 06:20:25 PM

సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీపాల్..

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు శ్రీపాల్(Assistant Director of Agriculture Department Sripal) ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. డబ్ల్యూ జి ఎల్ వరి-962, డబ్ల్యూ జి ఎల్ పెసర 385 రకం విత్తనాలు వరి 10 కేజీల బస్తా రూ.50 పెసర 3 కేజీల బస్తా రూ.50 ఈ విత్తనాలను ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అభివృద్ధి చేయబడినవని వీటిని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా అతి తక్కువ ధరకు రైతులకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.

ఈ పథకాన్ని నాణ్యమైన విత్తనం- రైతన్నకు నేస్తం అనే నినాదంతో రైతులకు పంపిణీ చేయడం జరుగుతుందని మహదేవపూర్ డివిజన్లోని ఐదు మండలాల్లోని రైతులు సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రెవిన్యూ గ్రామానికి రెండు వరి బస్తాలు, ఒకటి పెసర బస్తాలు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని, మొత్తం మహాదేవపూర్ మండలంలోని 31 రెవెన్యూ గ్రామాలకు 62 వరి బస్తాలు, పెసర 31 బస్తాలు, పలిమెల మండలంకు 15 రెవెన్యూ గ్రామాల గానం 45 వరి బస్తాలు, 15 పెసర బస్తాలు ఉన్నాయని వీటిని రైతులు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని సుప్రజ్యోతి, మండల ఎక్స్టెన్షన్ అధికారులు ధర్మేందర్, రచన, పుష్పలత, శరత్, రైతులు కడార్ల మల్లయ్య,పోత రాజబాబు, మేచినేని మలహల్రావు, కొండ గొర్ల పవన్ తదితర రైతులు పాల్గొన్నారు.