15 April, 2026 | 7:24 AM

ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

28-03-2025 01:02 AM

జిల్లా ఎస్పీ డి జానకి

మహబూబ్ నగర్ మార్చి 27 (విజయ క్రాంతి) : ఎండ తీవ్రత అధికంగా ఉన్న సందర్భంగా పోలీసులు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. గురువారం ఎండతీవ్రత నేపథ్యంలో ట్రాఫిక్ సిబ్బందికి కూల్ వాటర్ బాటిల్స్ క్యాప్ ల పంపిణీ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ప్రస్తుత వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, రోడ్లపై విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.