calender_icon.png 19 December, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీ ఆహారంపై ఉక్కుపాదం

18-12-2025 12:00:00 AM

  1. రామాయంపేట హోటళ్లలో విస్తృత తనిఖీలు

ఆమోఘ్ రెస్టారెంట్‌పై కేసు నమోదు

జిల్లా ఆహార భద్రత అధికారి స్వదీప్ కుమార్

రామాయంపేట, డిసెంబర్ 17: ఆహార భద్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై చర్యలు తీసుకుని, ఆహార భద్రత ప్రమాణాలను మెరుగుపరచడమే విస్తృత తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని మెదక్ జిల్లా ఆహార భద్రత నియంత్రణ అధికారి స్వదీప్ కుమార్ తెలిపారు. బుధవారం రామాయంపేట పట్టణంలోని అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్లో ఆహార భద్రతా అధికారి విస్తృత తనిఖీ నిర్వహించారు.

ఈ తనిఖీలో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులు, దుకాణంలో బూజు బట్టిన  ఉన్న పాపడ్లు కనిపించాయి. స్టోర్ రూమ్లో దొరికిన గడువు ముగిసిన షెజ్వాన్ సాస్ బాటిళ్లను రెస్టారెంట్లోని చైనీస్ వంటగదిలో ఉపయోగిస్తున్నారు. ఈ వస్తువులను ధ్వంసం చేశారు. ఇతర ఉల్లంఘనలను గుర్తించి నోటీసు జారీ చేశారు. జరిమానా విధించడానికి కేసు నమోదు చేయడానికి పంచనామా చేశారు. ఈ సందర్భంగా ఆహార భద్రత తనిఖీ అధికారి స్వదీప్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలపై ఫుడ్సేఫ్టీ ఉక్కుపాదం మోపుతుందన్నారు.

ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతో పాటు సూపర్ మార్కెట్లు, ఐస్క్రీం పార్లర్లు ఇతర వాటిపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఇలావుండగా జిల్లా ఆహార పరిరక్షణ (ఫుడ్ సేఫ్టీ) శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ  లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళాకు ఆహార వ్యాపారులు హాజరై తక్కువ సమయంలో నమోదు చేసుకోవాలని స్వదీప్ కుమార్ తెలిపారు. ఈ తనిఖీలలో ఫుడ్ శాంపిల్స్ అసిస్టెంట్ నజీర్, సిబ్బంది అరవింద్ పాల్గొన్నారు.