సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..
29-04-2026 09:29 PM
బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల విద్యార్థినిలు టెన్త్ లో ఫలితాల్లో తమ సత్తా చాటారు. ఎం భవిత 572/ 600 మార్కులు సాధించి తమ ప్రతిభ పాటవాలను నిరూపించుకున్నారు. ఈ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను విద్యార్థినులు ఉత్తమ ఫలితాలతో ముందు వరుసలో నిలబెట్టారు.






