9 May, 2026 | 1:41 PM

Breaking News

తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •  

రెండో రౌండ్‌లో తనీశా జోడీ

23-01-2025 12:00 AM
  1. పీవీ సింధు ఓటమి
  2. ఇండోనేషియా మాస్టర్స్

జకర్తా: ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధవారం భారత్‌కు ఏదీ కలిసిరాలేదు. సింగిల్స్‌లో లక్ష్యసేన్, మిక్స్‌డ్ డబుల్స్ మినహా మిగతా అన్నింటిలోనూ పరాజయాలే ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21-9, 21-14తో ఒబయాషి (జపాన్)పై సునాయాస విజయాన్ని అందుకున్నాడు.

మిక్స్‌డ్ డబుల్స్‌లో తనీశా- ధ్రవ్ జోడీ 21-18, 21-14తో పాంగ్ హో- సు యిన్ (మలేషియా)పై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది. మరో డబుల్స్ జోడీ రోహన్ కపూర్-రుత్విక జోడీ మాత్రం పరాజయం పాలైంది. భారత షట్లర్ పీవీ సింధు ఇండోనేషియా మాస్టర్స్‌లో మాత్రం తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టింది.

మహిళల సింగిల్స్ మొదటి రౌండ్‌లో సింధూ 20-22, 12-21తో వియత్నాంకు చెందిన తుయ్ గుయెన్ చేతిలో ఓటమి చవిచూసింది. మిగిలిన మ్యాచ్‌ల్లో తాన్య హేమంత్, అనుపమ ఉపాధ్యాయ ఓటమి పాలవ్వగా.. పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు, కిరణ్ జార్జి, ఆయుశ్ శెట్టి తొలి రౌండ్‌కే పరిమితమయ్యారు.