28-05-2025 08:16:47 PM
తాడ్వాయి (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao) రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని టీడీపీ ఎల్లారెడ్డి నియోజకవర్గ నాయకులు దేమి కమ్మరి రాజు(TDP Yella Reddy constituency leaders Demi Kammari Raju) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో బుధవారం టీడీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజు మాట్లాడుతూ... ఆయన రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు నందమూరి అని తెలిపారు ఈ సందర్భంగా మిఠాయిలు పంచుకొని జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భీమ్రావు, కురుమ దత్తయ్య, బోయిని రాజు, కమ్మరి నర్సింహులు, గంగయ్య, కృష్ణ, చారి, ఎల్లయ్య, లింగం, రాజయ్య, అంజయ్య, కాశీరాం, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.